తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 20వ తేదీన కోయిల్ ఆళ్వార్
తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఏకాంతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా 20న తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి అభిషేకం, అలంకారము, శుద్ధి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందని, ఈ సమయంలో భక్తులకు దర్శనం ఉండబోదని స్పష్టం చేశారు.