తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.
నిన్న శ్రీవారిని 65.840 మంది భక్తులు దర్శించుకోగా 34,135 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భ క్తులు సమర్పించిన కానుకల ద్వారా టీటీడీ హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
మార్చిలో 19.72 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. సర్వదర్శనం ప్రారం భించిన తరువాత భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. మార్చి నెలలో హుండీ కానుకల ద్వారా రూ.128.64 కోట్లు ఆదాయం వచ్చిందని, 9. 54 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమ ర్పించుకున్నారని తెలిపారు.