తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిన 56,588 మంది భక్తులు దర్శించుకోగా 16,754 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.26 కోట్లు వచ్చిందని తెలిపారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ సంక్రాంతి శుభాకాంక్షలు
తిరుమల, తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ , ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి శ్రీవారి భక్తులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.