తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవుల కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో వేంకటేశ్వరస్వామివార్ల సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 76,200 మంది భక్తులు దర్శించుకోగా 29,492 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.61 కోట్లు వచ్చిందన్నారు.