తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరాస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో (Tirumala) ఉన్న కంపార్టుమెంట్లు (Compartments) అన్నీ నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్హౌస్ వరకు భక్తులు స్వామివారిని దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsanam) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 78,557 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 42,083 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.48 కోట్లు వచ్చిందని వెల్లడించారు.