భోగైశ్వర్య ప్రసక్తానాం త యాపహృత చేతసామ్
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ నవిధీయతే॥ (2-44)
మనిషిలో భోగాసక్తత, ఐశ్వర్యకాంక్ష మొదలైనవి ఉన్నప్పుడు బుద్ధి అతని అధీనంలో ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు ఈ విషయంలో అర్జునుడిని హెచ్చరిస్తూ ‘భోగాల్లో కాని, ఐశ్వర్యంపై కాని అమితమైన ఆసక్తి కలిగిన వారు, వాటికి సంబంధించిన తియ్యని మాటలకు ప్రభావితులైన వారు తమ బుద్ధిని, జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. అలాంటి వారి మనసులో బుద్ధి నిశ్చయత ఉండదు. బుద్ధికి స్థిరత్వం ఉండదు’ అని చెప్పడం కేవలం అర్జునుడికే కాదు, సమస్త మానవజాతికి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశం. భోగలాలసత, ఐశ్వర్యదాహం వంటి అంశాలు మానవ జీవితాన్ని కష్టాలపాలు చేస్తాయి. కర్తవ్య నిర్వహణ ధర్మ బద్ధంగా చేయకుండా ఉండేవిధంగా అలసత్వానికి గురిచేస్తాయి. అంతేకాదు, ఒకానొక దశలో మానవప్రగతికి, సమాజ సంక్షేమానికి అడ్డుపడేటట్లు చేసి స్వార్థబుద్ధిని కలిగిస్తాయి. నియమబద్ధ మార్గంలో వాటిని అధిగమించాలి. సద్గురు అనుగ్రహంతో, సత్సంగంతో ఈ దుర్గుణాలను అధిగమించవచ్చు.
…? విష్ణువర్ధన్