ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు సిద్ధమవుతున్న
భారత క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్, రహానె, విరాట్ కోహ్లీ, పుజారా, ఇషాంత్ శర్మ, బుమ్రా తదితరులు టీకా వేయించుకున్నారు. తాజాగా టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ గురువారం కొవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్నాడు. వ్యాక్సిన్ వేయించుకుంటుండగా తీసిన ఫొటోను పంత్ సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు.
‘ఇవాళ వాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్నా. అర్హులైన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోండి. ఎంత త్వరగా టీకా వేయించుకుంటే అంత త్వరగా ఈ వైరస్ను ఓడించగలమని’ పంత్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించాడు. 23ఏండ్ల పంత్ న్యూజిలాండ్తో జరగనున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియాలో చోటుదక్కించుకున్నాడు.