Hyderabad | హైదరాబాద్ : రాచకొండ పోలీసు( Rachakonda Police ) కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్( Balapur )లో ఘోరం జరిగింది. ఓ 18 ఏండ్ల యువకుడిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటన యువకుడి ఇంటి ముందే జరిగింది. అయితే యువకుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఇంటి బయటకు వచ్చారు. అంతలోపే దుండగులు అక్కడ్నుంచి జారుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి( Osmania Hospital )కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న మహేశ్వరం( Maheshwaram ) డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ అంజయ్య, క్లూస్ టీమ్, బాలాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడిని పవన్గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.