శంషాబాద్ రూరల్ : మద్యం మత్తులో యువతి కారు నడిపి ముగ్గరిని గాయాలపాలు చేసిన ఘటన శంషాబాద్లో చోటుచేసుకున్నది. ఆర్జీఐఏ స్టేషన్ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన యువతి షేక్రోణి, యువకుడు అమీర్ సోహెల్ కారు నంబర్ టీఎస్16ఈఎల్ 5058లో షాద్నగర్ వైపు నుంచి నగరం వైపు వస్తు శంషాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రాగానే ఒక వ్యక్తిని ఢీకొన్నారు. కారు అదుపు తప్పడంతో మరో ఇద్దరిని ఢీకొట్టారు. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న ఇద్దరికి స్టేషన్కు తరలించారు. వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ చేక్ చేయగా యువకుడికి 550 శాతం, యువతికి 200 శాతం వచ్చింది. కారులో మద్యం బాటిల్స్ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.