శేరిలింగంపల్లి : న్యూఢిల్లీ, ఆగరా మండలం, తాపరియా గ్రామానికి చెందిన కళ్యాణ్సింగ్ బతుకుదెరువు నిమిత్తం కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వలసవచ్చి నానక్రాంగూడ సుమధుర బిల్డింగ్ వెనకబాగంలో లేబర్ క్యాంపు గుడిసెల్లో నివాసముంటున్నాడు.
కొకాపేట్ మూవీటవర్స్ సమీపంలో రహాదారి పక్కన టీస్టాల్ నడుపుతున్నాడు. కాగా ఈనెల 4న కళ్యాణ్సింగ్ కుమార్తె అవంతిక బాయి (19) ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. తెలిసినవారు, బందువులు, స్నేహితుల వద్ద వెతికిన ఆమె అచూకీ లభించలేదు.
దీంతో గురువారం స్థానిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవంతిక బాయి తల్లి గోరిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్ఐ సైదులు తెలిపారు. ఆమె అచూకీ తెలిసిన వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.