కాచిగూడ : మైనర్ బాలికను మాయమాటలతో మోసగించిన కేసులో ఓ యువకున్ని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం దూద్బౌలి ప్రాంతానికి చెందిన హర్షవర్ధన్ (19) విద్యార్థి.
కాచిగూడకు చెందిన మైనర్ బాలికతో దూద్బౌలిలో ఉండే బాలిక అత్తమ్మ ఇంటి వద్ద హర్షవర్ధన్కు పరిచయం ఏర్పడింది. అమ్మాయి దగ్గర ఫోటోలు తీసుకొని, బ్లాక్మెయిల్ చేస్తూ రూ.40 వేల రూపాయలు కావాలని లేని పక్షంలో నీ ఫోటోలు ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేస్తానని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.
అనేక మార్లు నచ్చచెప్పిన ఆతనిలో మార్పురాలేదు.బాలిక పిర్యాదు మేరకు శుక్రవారం హర్షవర్ధన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.