మాదాపూర్ : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం … మహబూబ్నగర్ జిల్లా నెల్లికుదూరు మండలం, మునగాల గ్రామానికి చెందిన యాదగిరి (22) ఏసీ లు రిపేరు చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 12 న మద్యాహ్నం 3 గంటల సమయంలో కావూరిహిల్స్లోని ఓ ఇంట్లో ఏసీ రిపేరు రావడంతో ఇంటి యాజమానులు అతనికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
దీంతో యాదగిరి అక్కడికి చేరుకొని ఏసీ రిపేరు చేస్తుండగా కరెంట్ వైర్ తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో ఇంటి యాజమానులు దగ్గరలోని మెడికవర్ దవఖానాకు తరలించారు. వైద్యులు అతన్ని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇంటి యాజమాని నిర్లక్ష్యం కాని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.