ఖమ్మం: ప్రమాదవ శాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మండల పరిధి మంచుకొండ వద్ద చోటు చేసుకుంది. ఎస్సై మాచినేని రవి తెలిపిన ప్రకారం..బూడిదంపాడు గ్రామానికి చెందిన చుండూరి నాగేంద్ర(21) కవర్ల వ్యాపారం చేస్తున్నాడు. కాగా శుక్రవారం ద్విచక్ర వాహనంపై ఖమ్మం వెళ్లిన నాగేంద్ర తిరిగి బూడిదంపాడు వస్తుండగా మంచుకొండ వద్ద వర్షానికి వాహనం అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటనలో నాగేంద్ర తీవ్రగాయాలై మృతి చెందాడు.