మాదాపూర్ : ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మాల్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం … కొండాపూర్లోని సిద్ధిక్నగర్లో నివాసం ఉంటున్న హిమాన్షు రాయ్ (29) ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు.
ఈ నెల 3వ తేదీన తెల్లవారు జామున 6:30 గంటలకు ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో గది నెంబర్ 201లో బాత్రూంలోని రాడ్కు కేబుల్ వైర్తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అతని భావ దృబజ్యోతి శరణ్య ఇద్దరు కలిసి ఒకే దగ్గర సెక్యూరిటీ గార్డ్స్గా పని చేస్తుంటారు.
ఉదయం డ్యూటీకి వెళ్ళేందుకు హమాన్షు రాయ్ ఇంటికి వచ్చాడు. అతను ఎంతసేపటికి తలుపులు కొట్టిన తీయకపోవడంతో అనుమానం వచ్చి తోటి వారి సహయంతో ఇంటి తలుపులు బద్ధలు కొట్టి చూడగా బాత్రూంలో ఊరివేసుకొని కనిపించాడు.
దీంతో అతని భావ అంబులెన్స్కు ఫోన్ చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అతను మృతి చెందినట్లు నిర్థారించారు. దీంతో మృతుడి భావ దృబ జ్యోతి శరణ్య మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.