కాచిగూడ : బట్టల షాపుకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్లోని గోల్నాక వెజిటేబుల్ మార్కెట్ ప్రాంతానికి చెందిన భాస్కర్ కుమార్తె అక్షిత (15) స్థానిక బట్టల షాపులో పనిచేస్తుంది.ఈ నెల 23న ఉదయం బట్టల షాపుకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన అక్షిత ఇప్పటికీ తిరిగి రాలేదు.
కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో తండ్రి భాస్కర్ ఆదివారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంట్లోంచి అక్షిత వెళ్లే సమయంలో నీలి రంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.