కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో కాలిన గాయాలతో మహిళ విగతజీవిగా పడిఉండటం కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మహిళ ముఖాన్ని యాసిడ్తో కాల్చారని స్ధానికులు చెబుతున్నారు. నిందితులు మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మహిళ శరీరంపై పలు గాయాల గుర్తులున్నాయి. ఘటనా స్ధలంలో కత్తులు, యాసిడ్, వాడిన కండోమ్స్, దుస్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం కోసం తరలించారు.
Read More :