న్యూఢిల్లీ : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber Fraud) విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు అమాయాకుల బ్యాంకు ఖాతాల నుంచి అందినకాడికి లూటీ చేస్తున్నారు. లేటెస్ట్గా ఘజియాబాద్కు చెందిన ప్రాచీ మాధుర్ అనే మహిళ ఏకంగా రూ. 13 లక్షలు పోగొట్టుకున్నారు.
టెక్ట్స్ మెసేజెస్ ద్వారా ఆమెను సంప్రదించిన స్కామర్లు యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తూ డబ్బు సంపాదించవచ్చని మభ్యపెట్టారు. ప్రతి యూట్యూబ్ వీడియో లైక్కు రూ. 50 వస్తాయని స్కామర్లు ఆమెను నమ్మబలికారు. ఈనెల 16, 18 తేదీల్లో ఆమె యూట్యూబ్ వీడియోలను లైక్ చేయగా వెల్ఫేర్ టాస్క్ కింద ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు ప్రాచీని కోరారు.
అలా చేస్తే కమిషన్తో పాటు మెరుగైన రిటన్స్ వస్తాయని ఆమెకు నమ్మబలికారు. కమిషన్ ఆశతో ఆమె దశల వారీగా నిందితులకు రూ 13 లక్షలు పంపారు. ఆపై నిందితులు ముఖం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని, సైబర్ సెల్ సాయంతో నిందితులను గుర్తిస్తామని కొత్వాలి ఏసీపీ నిమిష్ పటేల్ తెలిపారు.
Read More :