మధుర: ఉత్తర్ప్రదేశ్లోని మధుర రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU) రైలు ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో రైలు మధుర రైల్వే స్టేషన్కు చేరుకోగానే ప్రయాణికులు దిగిపోయారు. ఆ తర్వాత లోకోపైలెట్ రైలును స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా ప్లాట్ఫాం పైకి దూసుకెళ్లింది. అయితే, అప్పటికే రైలు దిగిన ప్రయాణికులంతా స్టేషన్ నుంచి బయటికి వెళ్లిపోవడంతో పెను ముప్పు తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరుగలేదు. రైలు ప్లాట్ఫాం పైకి ఎలా వచ్చిందో తెలియట్లేదని స్టేషన్ అధికారులు చెబుతున్నారు.
‘రైలు షకుర్ బస్తీ నుంచి బయలుదేరిన రైలు రాత్రి 10:49 గంటలకు మధుర స్టేషన్కు వచ్చి ఆగింది. ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు గానీ, ఆ రైలు ఒక్కసారిగా ప్లాట్ఫాం పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం’ అని మధుర స్టేషన్ డైరెక్టర్ ఎస్కే శ్రీవాస్తవ తెలిపారు.