హైదరాబాద్ : ఎంఎంటీస్ ట్రైన్లో మహిళ పై ఓ ఆగంతకుడు మహిళను కత్తితో బెదిరించి నగదు, మొబైల్తో పరారయ్యాడు. ఈ సంఘటన శేరి లింగంపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
బాధితురాలి కథనం మేరకు..సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టంలో మణికర్ణ అనే మహిళ సీనియర్ ప్రొజెస్ట్ ఇంజినీర్గా పనిచేస్తున్నది.
రాత్రి విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో లేడీస్ కంపార్టెమెంట్లోకి అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తి ఎక్కాడన్నారు. లింగంపల్లికి ట్రెయిన్ చేరుకునే సమయంలో
దుండగుడు కత్తితో కత్తితో బెదిరించి చేతిలో ఉన్న మొబైల్, నగదు లాక్కెళ్లాడని తెలిపింది. అప్పటికి ఆ కోచ్లో ఎవరు లేరని ఒక్కదానినే ఉన్నట్లు ఆమె తెలిపింది. మహిళా కంపార్ట్మెంట్లో ప్రయాణించే వారికి తగిన భద్రతను కల్పించాలని ఆమె కోరింది.