విశాఖపట్నం : కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో స్కామ్తో ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఆన్లైన్ స్కామ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్గా విశాఖపట్నానికి చెందిన మహిళా టెకీని (Woman Techie) స్కామర్లు రూ. 12 లక్షలకు మోసం చేశారు.
పార్ట్టైం ఐటీ జాబ్ ఆశ చూపిన స్కామర్లు మల్లా జ్యోతిర్మయి నుంచి భారీ మొత్తంలో డబ్బు దండుకున్నారు. పార్ట్టైం జాబ్ ఆఫర్ను ప్రయత్నించే క్రమంలో ఆమె స్కామర్ల చేతిలో మోసపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జ్యోతిర్మయి బ్యాంక్ ఖాతాలో ఆమె తండ్రి రూ. 15 లక్షలు డిపాజిట్ చేశారు. ఇక ఓ ఐటీ కంపెనీలో పార్ట్టైం జాబ్ ఆఫర్ పేరుతో నిందితులు సంప్రదించగా చేరేందుకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేసింది.
హైరింగ్ ప్రక్రియకు లాంఛనాల పేరుతో రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 5000 చెల్లించాలని కోరారు. పరీక్షల కోసం మరింత డబ్బు పంపాలని నిందితుల నుంచి ఆమెకు మెసేజ్లు వచ్చాయి. రూ. లక్ష కాషన్ డిపాజిట్ చెల్లిస్తే మూడు నెలల్లో రూ. 1.4 లక్షలు వస్తాయని స్కామర్లు నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన జ్యోతిర్మయి స్కామర్లకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలకు రూ. 12.84 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. మరో నాలుగు లక్షలు పంపాలని వారు కోరడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు అనకాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Read More :