న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉగాండ మహిళ పట్టుబడింది. ఏప్రిల్ 14న దోహ నుంచి నగరానికి చేరుకున్న మహిళా ప్రయాణీకురాలి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు ఆమెను తనిఖీ చేశారు.
887 గ్రాముల హెరాయిన్తో కూడిన 126 క్యాప్సుల్స్ను మింగేసి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉగాండ మహిళ దొరికిపోయింది. తొలుత ఆమె బ్యాగేజ్ను తనిఖీ చేయగా ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదు. ఆపై వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె శరీరం లోపల నిర్ధిష్ట మెటీరియల్ ఉన్నట్టు వెల్లడైంది.
ఆపై ఆమె శరీరంలోపల 126 క్యాప్సుల్స్ హెరాయిన్ ఉన్నట్టు బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ హెరాయిన్ విలువ 6.65 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.