చండీఘఢ్ : పంజాబ్లోని లుధియానాలో దారుణ ఘటన వెలుగుచూసింది. చేతబడి అనుమానంతో 70 ఏండ్ల మహిళను పొరుగున ఉండే యువకుడు (22) కత్తితో పొడిచి చంపిన ఘటన నగర శివార్లలోని మెహర్బన్ ప్రాంత పరిధిలో చుహర్వాల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. నిందితుడిని జస్పాల్ సింగ్ జసా, బాధితురాలిని స్వరణ్ కౌర్గా గుర్తించారు. నిందితుడు, అతడి తల్లి వృద్ధురాలు తమపై చేతబడి చేస్తోందని అనుమానించారు.
శనివారం రాత్రి వృద్ధురాలితో తల్లీ కొడుకులు ఘర్షణ పడ్డారు. బాధితురాలి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం కౌర్ ప్రార్ధనల కోసం గురుద్వారకు వెళుతుండగా ఆ ప్రాంతంలో మాటువేసిన నిందితుడు కౌర్పై కత్తితో దాడి చేశారు. బాధితురాలు చేతబడి చేస్తోందని దుర్భాషలాడుతూ నిందితుడు ఆరుసార్లు ఆమెను కత్తితో పొడిచి పరారయ్యాడు. నిందితుడు జస్పాల్ సింగ్ను హత్యకు కుట్రపన్నిన అతడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.