రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో ఓ మహిళను కత్తులతో పొడిచి చంపారు. స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. అయితే మహిళపై లైంగికదాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలిని మాడ్గుల మండలం చంద్రానిపల్లికి చెందిన పోచమ్మ(39)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.