కుత్బుల్లాపూర్, ఆగస్టు : మతిస్థితిమితంలో బాధపడుతున్న గృహిణి అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం…జీడిమెట్ల గ్రామానికి చెందిన జి. పుష్ఫ(38) గత కొన్ని రోజుల నుంచి మతిస్థిమితం లేమితో బాధపడుతున్నది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే ఉంటుంది.
కాగా శుక్రవారం సాయంత్రం సమయంలో బట్టలు ఆరేయడానికి బయటకు వచ్చిన పుష్ప తిరిగి ఇంటిలోపలికి రాలేదు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు గమనించి బయటకు వచ్చి చూడగా కన్పించలేదు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతకడంతో పాటు తెలిసిన వారికి వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో బాధితురాలి భర్త రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.