న్యూఢిల్లీ : ఒకరిని కలుసుకోవడం ఆపై అనుబంధాలను పెంచుకునే రోజులకు కాలం చెల్లగా ఆన్లైన్ వేదికగా టిండర్, హింజ్, బంబుల్ వంటి ప్లాట్ఫాంల ద్వారా రొమాంటిక్ పార్టనర్లను (Cyber Fruad) ఎంచుకుంటున్నారు. మిలియన్ల కొద్దీ యూజర్లతో ఈ యాప్లు యువతీ, యువకులను దగ్గర చేస్తున్నాయి. అయితే డేటింగ్ యాప్స్తో అపరిచితుల నుంచి నిత్యం ముప్పు పొంచే ఉంటుంది. టిండర్ మ్యాచ్లో స్కామర్ బారినపడి ఓ 42 ఏండ్ల మహిళ తాను పొదుపు చేసుకున్న మొత్తాన్నీ కోల్పోయారు. స్కామర్ ప్రతిపాదించిన టిండర్ మ్యాచ్లో ఆమె ఏకంగా లక్ష డాలర్లను (రూ. 80 లక్షలు) పోగొట్టుకున్నారు.
ముగ్గురు పిల్లలు కలిగి విడాకులు తీసుకున్నరెబెకా హాలోవే అనే మహిళ రెండో వివాహంతో జీవితంలో కుదురుకోవచ్చని ఆశపడింది. టిండర్ మ్యాచ్లో భాగస్వామి లభించినందుకు సంబరపడింది. ఈ ఏడాది మార్చిలో రెబెకాకు పరిచయమైన వ్యక్తి తనను ఫ్రెంచ్ బిజినెస్మన్ ఫ్రెడ్గా చెప్పుకున్నాడు. ఆపై ఫ్రెడ్ ఆమెను వ్యక్తిగతంగా ఎన్నడూ కలవకపోవడంతో పాటు వీడియో కాల్స్లో మాట్లాడేందుకూ నిరాకరించాడు. టెక్ట్స్ మెసేజ్ల ద్వారానే రెబెకాతో ఫ్రెడ్ టచ్లో ఉన్నాడు.
తమ సంబంధం ప్రత్యేక బంధంగా ముడిపడుతుందని రెబెకా నమ్మింది. రెబెకాను మరింత నమ్మబలికేందుకు తనకు ఓ కూతురు ఉందని, ఆమె ఫిలడెల్పియాలో నివసిస్తోందని చెప్పాడు. తనకు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు ఉన్నాయని చెబుతూ రెబెకాను కూడా ఇన్వెస్ట్ చేయాలని ఒప్పించాడు. ఈ క్రమంలో కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెట్టిన రెబెకాకు మెరుగైన రిటన్స్ రావడంతో పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని ఫ్రెడ్ ఆమెను మభ్యపెట్టాడు. దీంతో ఆమె తన సేవింగ్స్ మొత్తాన్ని ఏకంగా లక్ష డాలర్లను ఇన్వెస్ట్ చేయగా ఆపై ఆ మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవడంలో విఫలమైంది. ఇటీవల ఈ తరహా కేసులు అధికమయ్యాయని తన ఫ్రెండ్ చెప్పిన తర్వాత తాను మోసపోయానని గ్రహించానని రెబెకా వాపోయింది.
Read More :
Drugs | హైదరాబాద్లో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. 400 మెఫెంటెర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్