వెంగళరావునగర్ : రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఆటో ఢీ కొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.. ఎస్సై కొటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం…
బల్కంపేటకు చెందిన శ్రీలత (57) అనే మహిళ అమీర్పేట డీకే రోడ్డులోని ఓ ప్లే స్కూల్లో చదువుతున్న తన మనవరాలి వద్దకు వెళ్తుంది. ఎస్.ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సమీపం వద్దకు రాగానే ఫతేనగర్ నుంచి వేగంగా వచ్చిన ఆటో వెనుక నుంచి శ్రీలతను ఢీ కొట్టింది. దీంతో శ్రీలత కింద పడి పోయింది.
తలకు గాయాలు కావండంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు చికిత్స నిమిత్తం ఆమెను దవాఖానాకు తరలించారు. మద్యం మత్తులో ఆటో నడపి, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ శివ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.