భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మహిళ పట్ల ఓ పెయింటర్ అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. పెయింటింగ్ పనులు ఉన్నాయని గౌతంనగర్ ప్రాంతానికి చెందిన మహిళ పిలవడంతో శనివారం రాత్రి ఆమె ఇంటికి వచ్చిన పెయింటర్ దేవేంద్ర కసోటే అమర్యాదకరంగా ప్రవర్తించాడు.
ఇంట్లో ఏ ప్రాంతంలో వైట్వాష్ వేయాలో మహిళ (45) చెబుతుండగా పెయింటర్ ఆమెను లైంగికంగా వేధించాడు. మహిళ సాయం కోసం పెద్దగా అరవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గౌతంనగర్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.