బెంగళూర్ : భర్త (55) తీవ్రంగా హింసించడంతో ఇంటిలోని బెడ్రూంలో 48 ఏండ్ల మహిళ విగతజీవిగా పడిఉన్న ఘటన బెంగళూర్లో ఆదివారం వెలుగుచూసింది. మహిళను తీవ్రంగా కొట్టిన అనంతరం ఆమె స్ప్రహ కోల్పోవడంతో మూడు గంటల పాటు బెడ్రూంలోనే నిర్బంధించాడు. కొడుకు (24) ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని తలఘటపుర సమీపంలోని నాగెగౌడనపాళ్యెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదివారం సాయంత్రం తాను 4 గంటల సమయంలో బయటకువెళ్లి 6.30 గంటలకు తిరిగిరాగా తల్లి స్ప్రహ కోల్పోయి కనిపించిందని కొడుకు గిరీష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళను నిర్భందించి బెడ్రూం తాళం వేసిన నిందితుడు మారప్ప కొడుకు సహా ఇరుగుపొరుగు వారు వేడుకున్నా తలుపు తీసేందుకు నిరాకరించాడు.
దీంతో గిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా మహిళ విగతజీవిగా పడిఉంది. గత కొన్నేండ్లుగా మహిళను భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు. తన తండ్రి తరచూ తల్లిని కొట్టేందుకు చెక్కతో చేసిన కర్రను వాడేవాడని గిరీష్ చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.