పహాడీషరీఫ్: దుస్తులు ఇస్త్రీ చేయించడానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ నరోత్తమరెడ్డి వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి గ్రామంలో నివాసముంటున్న ఆకుల పద్మ(30) గృహిణీ.
ఈ నెల 28న సాయంత్రం బట్టలు ఇస్త్రీ చేయించుకొని వస్తానని ఇంట్లోచెప్పి బయటకు వెళ్లింది. కానీ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో ఆమె భర్త భిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆదివారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.