యాచారం/రంగారెడ్డి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రభాకర్ కథనం ప్రకారం..నందివనపర్తి గ్రామానికి చెందిన కాలె మంజుల (35) అనే మహిళ తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఆదివారం తెల్లవారు జామున మంజుల ఆత్మహత్యను గుర్తించిన స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. కాగా, తన భార్య మృతి పట్ల అనుమానాలున్నాయని మంజుల భర్త రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.