మహబూబ్నగర్ : మహిళ ప్రాణాలను మటన్ ముక్క బలిగొన్నది. ఓ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దావత్లో మహిళ మటన్ తింటుండంగా, ఆమె గొంతులో ముక్క ఇరుక్కుంది. దీంతో ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నవాబ్పేట మండలం పరిధిలోని కూచూర్ గ్రామానికి చెందిన మంగళి చిన్నమ్మ(60) సమీప బంధువులు.. ఫతేపూర్ మైసమ్మ వద్ద బుధవారం దావత్ నిర్వహించారు. దీంతో చిన్నమ్మ ఆ దావత్కు వెళ్లింది. ఇక భోజనం చేస్తుండగా.. చిన్నమ్మ గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. అది బయటకు రాలేదు. లోపలికి వెళ్లలేదు. దీంతో ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నట్లు బంధువులు తెలిపారు.