మెహిదీపట్నం : కుటుంబసమస్యల కారణంగా ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్రెడ్డి కథనం ప్రకారం…… టోలిచౌకి రాహుల్ కాలనీలో నివసించే సభా (31) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నది.
ఈమె గత కొంత కాలంగా ఓ వ్యక్తితో సహహాజీవనం చేస్తున్నది. కొన్ని రోజులుగా అతడు ఆమెకు దూరంగా ఉంటు న్నాడు. తనను పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన సబా శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.