అహ్మదాబాద్ : హోటల్ రూంలో ముగ్గురు వ్యక్తులు తనను వేధింపులకు గురిచేసి దాడికి పాల్పడ్డారంటూ యువతి కంట్రోల్ రూంకు ఫోన్ చేయగా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అహ్మదాబాద్లోని ఎస్జీ రోడ్డులోని హోటల్లో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.
పోలీసులు ఆమె తెలిపిన హోటల్ రూంకు చేరుకోగానే తలపై గాయాలతో యువతి(22) కనిపించింది. యువతిని రీనాకుమారి షని (22)గా గుర్తించారు. అయితే ఘటనను పోలీసులకు యువతి వివరిస్తుండగా ఆమె మద్యం సేవించినట్టు అనుమానించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. యువతిపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తుల పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.