జైపూర్ : మంత్రగత్తెగా మహిళపై పేరుమోపి పలువురు ఆమెను దారుణంగా హింసించిన ఘటన రాజస్థాన్ లోని బుంది జిల్లా భజ్నేరి గ్రామంలో వెలుగుచూసింది. గత ఆదివారం ఇక్బాల్ ఖాన్ అనే వ్యక్తితో పాటు దాదాపు పదిమంది మహిళ ఇంటికి వచ్చి ఆమెను తీవ్రంగా కొట్టి హింసించారు. తన కుమారుడికి మహిళ చేతబడి చేయడంతోనే మరణించాడని ఇక్బాల్ ఆరోపిస్తూ ఆమెను వేధింపులకు గురిచేశారు.
ఇక కుటుంబ సభ్యుల సహకారంతో బాధిత మహిళ ఫిర్యాదు చేసినా స్ధానిక పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. మహిళ తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించిన అనంతరం కేసు నమోదవడం గమనార్హం. దక్షిణ, మధ్య రాజస్ధాన్ లోని గ్రామీణ ప్రాంతాల్లో మంత్రగత్తెలని ముద్రవేస్తూ పలుచోట్ల మహిళలపై దాడులు పెచ్చుమీరడం ఆందోళన రేకెత్తిస్తోంది.