Delhi | న్యూఢిల్లీ : ఆర్థరైటిస్తో బాధడుతున్న అత్తను కోడలు దోశ పెంకతో కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని నెబ్ సరాయి ఏరియాలో ఏప్రిల్ 28న చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోల్కతాకు చెందిన సుర్జీత్ సామ్(51), షర్మిష్ఠ సామ్(48), అనే దంపతులు తమ కూతురు(16)తో కలిసి ఢిల్లీలోని నెబ్ సరాయి ఏరియాలో 2014 నుంచి నివాసముంటున్నారు. అయితే సుర్జీత్ తల్లి(86) కోల్కతాలోనే ఉంటుంది. తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో.. 2022లో ఢిల్లీకి తీసుకొచ్చి, తన ఇంటి ముందే ఓ కిరాయి గదిలో తల్లిని ఉంచాడు.
అయితే ఆర్థరైటిస్తో బాధపడుతున్న అత్తకు కోడలు సేవలు చేయడంలో ఇబ్బంది పడుతోంది. దీంతో ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10:30 గంటలకు అత్త ఉంటున్న గదిలోకి వెళ్లి దోశ పెంకతో దాడి చేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం జరగడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయింది వృద్ధురాలు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించగా, ఆమె శరీరంపై 14 గాయాలు ఉన్నట్లు తేల్చారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా, కోడలు షర్మిష్టనే దోశ పెంకతో కొట్టి చంపినట్లు తేలింది.