న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. అవుటర్ ఢిల్లీలోని జిమ్లో మహిళ (21)పై ఆమె యజమాని (35), జిమ్ ఓనర్ (39)తో పాటు మరో బాలుడు (17) సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి జరిగింది.
మహిళ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఆమె యజమాని ఫోన్ చేసి తన ఫ్రెండ్ జిమ్లో శుభ్రం చేసే పనిఉందని అక్కడికి రావాలని కోరాడు. ఆమె జిమ్కు చేరుకోగానే సిబ్బంది తలుపులు మూసివేయగా అక్కడే ఉన్న యజమానితో పాటు జిమ్ ఓనర్, మరో బాలుడు మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఘటనా స్ధలం నుంచి నిందితులు పారిపోతూ ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురువుతాయని బాధితురాలిని హెచ్చరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.