అహ్మదాబాద్ : వరకట్నవేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను లోబరుచుకుని పెండ్లి పేరుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ఉదంతం అహ్మదాబాద్లో వెలుగుచూసింది. మహిళ(38)పై లైంగిక దాడికి పాల్పడిన అభియోగాలను కానిస్టేబుల్పై నమోదు చేశారు.
తన మాజీ భర్తపై వరకట్న వేధింపులకు పాల్పడినందుకు కేసు నమోదు చేసేందుకు తాను కానిస్టేబుల్ను ఆశ్రయించగా నిందితుడిపై కఠిన చర్యలు చేపడతానని భరోసా ఇచ్చాడని, ఆపై తనను పెండ్లి చేసుకుంటానని చెప్పి మూడేండ్లుగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెటిల్మెంట్ కోసం తనను కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేయగా ఈ ఏడాది మేలో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు.
నిందితుడు తనను అహ్మదాబాద్లోని హోటల్లో గడపాలని కూడా ఒత్తిడి తెచ్చాడని, హోటల్లోనూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేశాడని బాధిత మహిళ కానిస్టేబుల్పై ఫిర్యాదు చేశారు. మహిళను మోసగించి లైంగిక దాడికి పాల్పడటంపై పోలీసులు కానిస్టేబుల్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.