Rangareddy | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణం జరిగింది. జన్వాడ్కు చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ భార్యను అతి కిరాతకంగా చంపాడు. అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ ఇద్దరు పిల్లల ముందే ఆర్ఎంపీ డాక్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పిల్లల రోదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. భార్యను ఎందుకు చంపాల్సి వచ్చింది..? అతను ఎందుకు ఉరేసుకున్నాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.