POCSO Court | వనపర్తి : బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషికి వనపర్తి పోక్సో కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం రామన్పాడు గ్రామానికి చెందిన ఓ బాలికను గతంలో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు.
ఈ కేసు విచారణ అనంతరం పోక్సో కోర్టు జడ్జి సునీత బుధవారం తీర్పు వెల్లడించారు. దోషికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించారు. బాలికలు, మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలను అరికట్టేందుకు శిక్షలు కఠినంగా ఉంటాయని జడ్జి సునీత ఈ సందర్భంగా హెచ్చరించారు.
వనపర్తి పోక్సో కోర్టులో ఇది మొదటి తీర్పు అని వనపర్తి అదనపు జిల్లా కోర్టు పీపీ చంద్రశేఖర్ రావు తెలిపారు. బాలికలు, మహిళల పట్ల జరిగే నేరాలపై న్యాయస్థానం సీరియస్గా వ్యవహరిస్తుండటంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.