మోమిన్పేట : బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని అమ్రాది కలాన్ గ్రామానికి చెందిన బ్యాగరి ఆనందం (25) వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం తన స్నేహితులతో కలిసి బయటకీ వెళ్తున్న సాయంత్రం వరకు ఇంటికి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆనందం స్నేహితులైన అనిల్, ప్రమోద్, వినేకర్, ఎల్లయ్య, వెంకట్, శివకుమార్తో కలిసి శుక్రవారం మద్యం సేవించి సరదగా రచప్ప పటేల్ బావిలో ఈత కోడుతుండంగా ఆనందం బావిలో దూకి గల్లంతయ్యాడు. స్నేహితులు అతని కోసం ఎంత వెతికినా కనిపంచలేదు. దీంతో వారు బయానికి గురై ఎవ్వరికి చెప్పకుండా అక్కడి నుంచి జారుకున్నారు.
సాయంత్రమైన ఆనందం ఇంటికి రాకపోవడంతో కుటంబ సభ్యులు ఆనందం కోసం వెతుకుతుండగా శనివారం అదే గ్రామానికి చెందిన రచప్ప పటేల్ బావిలో శవమై కనిపించినట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి దవాఖానకు తరలించారు. మద్యం సేవించి బావిలో దూకడంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస ఆడక మరణించినట్లు పోస్టుమార్టంలో నిర్ధారన అయిందని సీఐ వెంకటేశం తెలిపారు. భార్య శ్రీవిద్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాని తెలిపారు.