కులకచర్ల : మనస్తాపంతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కులకచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కులకచర్ల గ్రామానికి చెందిన శివానీ సత్యమ్మకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు శివాని శ్రీనివాస్ (35) బీటెక్ పూర్తి చేశాడు. బీటెక్ పూర్తి చేసిన ఉద్యోగం లేదు, పెళ్లీ కాలేదని చుట్టు పక్కల వారు అనడంతో మనస్థాపానికి గురైన శ్రీనివాస్ మంగళవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు తన చావుకు ఎవ్వరూ కారణం కాదని సూసైడ్నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.