వికారాబాద్ : అటవీ ప్రాంతంలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి డబ్బులు లాకెళ్లిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూరు మండలం కెరెళ్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు కారు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగా గురువారం వికారాబాద్ నుంచి కెరెళ్లికి తన ద్విచక్ర వాహనంపై రాత్రి 9:30 గంటలకు వెళ్తున్నాడు. వికారాబాద్ బుగ్గరామలింగేశ్వరాలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ముసుగు వేసుకుని ప్రవీణ్ వాహనాన్ని ఆపారు.
ప్రవీణ్ బైక్ ఆపాడంతో అతడిని కొట్టి, అతని వద్ద ఉన్న రూ. 1200లను లాకెళ్లారు. శుక్రవారం ప్రవీణ్ వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.