బొంరాస్ పేట : మండలంలోని దుద్యాల గ్రామంలో బుధవారం సాయంత్రం జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది కోమటి రాజు కిరాణ దుకాణంపై దాడి చేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 58వేల 678 విలువ గల 40 వేల 948 సాగర్, గుట్కా ప్యాకెట్లు, రూ. 8800ల విలువ గల 440 పారిస్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 67,478 ఉంటుందని ఇన్చార్జి ఎస్ఐ స్రవంతిరెడ్డి తెలిపారు. వీటిని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు అప్పగించామని వారు పరిశీలించిన తరువాత దుకాణం యజమానికి జరిమానా విధిస్తామని ఎస్ఐ తెలిపారు.