కులకచర్ల : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నసంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ గతంలో సుజాతతో వివాహం జరిగింది. కుటుంబంలో గొడవ జరగడంతో తన భార్య సుజాతతో దూరంగా ఉంటూ రెండో వివాహం మల్కాపూర్ గ్రామానికి చెందిన శిరీషను గత 4నెలల క్రితం చేసుకున్నాడు. వీరు ఇరువురు షాద్నగర్లో నివాసముంటున్నారు. గోపాల్ రెండో వివాహం విషయం మొదటి భార్యకు సుజాతకు తెలియడంతో వారి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.
బుధవారం గోపాల్ తన రెండో భార్య శిరీషతో మందిపల్ గ్రామానికి వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మొదటి భార్య మందిపల్ గ్రామానికి చేరుకొని శిరీషతో గొడవ పడగా మనస్థాపానికి గురై గురువారం వారి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.