వికారాబాద్ : ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన వికారాబాద్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఓ వ్యక్తి (35) గొల్లగూడ, శంకర్పల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఒంటిపై బూడిద రంగు చొక్క, వంకాయ రంగు ప్యాంట్ కలిగి ఉన్నాడు. వికారాబాద్ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు తెలిసిన వారు వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు.