కులకచర్ల : చిరుత దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన కులకచర్ల మండల పరిధిలోని కుస్మ సముద్రం చెరువుముందలితండా గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువుముందలితండా(కె) గ్రామ పంచాయతీకి చెందిన శంకర్ తన ఆవును సోమవారం రాత్రి పొలం దగ్గర కట్టేసి ఇంటికి వచ్చాడు. ఉదయం వెళ్లి ఆవును చూడగా ఆవు కనిపించలేదు. వెంటనే అడవిలోకి వెళ్లి వెతికి చూడగా ఆవు చిరుతదాడిలో మృతి చెందినట్లు గమనించాడు.
చిరుత దాడిలో ఆవు మృతి చెందిందనే విషయాన్ని తెలుసుకున్న తండా ప్రజలు తమపై ఎప్పుడు దాడి చేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు తెలియజేసిన ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని, సంబంధిత అటవీశాఖ జిల్లా అధికారులు ఈ విషయాన్ని గమణించి తమను చిరుతదాడి నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.