బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం, బషీరాబాద్ మండలం మైల్వార్ అంతర్ రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ అధికారులు భారీగా క్లోరల్ హైడ్రేట్ను పట్టుకున్నారు. బుధవారం మైల్వార్ చెక్పోస్టు వద్ద ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య ఆధ్వర్యంలో సీఐ శ్రీధర్, ఎస్సై కుర్మానాయక్లు వాహనాలు తనిఖీ చేస్తుడంగా, కర్నాటక రాష్ట్రానికి చెందిన కేఏ3డీ 7216 వాహనంలో క్లోరల్ హైడ్రేట్ లభ్యమైంది. దీంతో వాహనంలో ఉన్న వ్యక్తిని ఆరా తీయగా అతడి పేరు కాలాల్ శివరాములు, కళ్బుర్గి రాష్ట్రం, సెడం తాలూకా బనూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని, తాండూరు ఎక్సైజ్ సీఐ తూక్యానాయక్కు అప్పగించారు.
అతడిని విచారించగా మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు తెలింది. వాహనంలో రూ. 5లక్షల విలువైన 290కేజీల క్లోరల్ హైడ్రేట్ ఉన్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై విష్ణు, కానిస్టేబుల్స్ కిషన్రావు, సుధాకర్, శ్రీశైలం, ప్రవీణ్కుమార్ ఉన్నారు.