న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డును దాటుతున్న ఒక వ్యక్తిపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సెంట్రల్ ఢిల్లీలోని జనపథ్లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక ఎస్యూవీ వాహనం నడుస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 39 ఏండ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండగా వెళ్లిపోయాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారు షాకయ్యారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరారు. వాహనం దూసుకెళ్లిన ఘటనలో మరణించిన వ్యక్తిని గుర్తించారు. అతడ్ని ఢీకొట్టిన వాహనం డ్రైవర్ గురించి ఇంకా ఏమీ తెలియలేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ వాహనం డ్రైవర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాద ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video Shows Horrific Accident In Central Delhi, SUV Runs Over Pedestrian https://t.co/9GpCje85xa pic.twitter.com/NTSnWqEg0U
— NDTV (@ndtv) March 30, 2022