భోపాల్ : బీరు బాటిళ్ల లోడ్తో వెళుతున్న వాహనం మధ్యప్రదేశ్లోని బర్వాని బ్రిడ్జిపై కారును ఢీకొంది. బుధవారం ఉదయం ఈ ఘటన జరగ్గా వాహనంలోని బీరు బాటిళ్లు బ్రిడ్జిపై చెల్లాచెదురయ్యాయి. దీంతో అటుగా వెళుతున్న వారంతా ఘటనా ప్రాంతానికి చేరుకుని బీరు బాటిళ్లను తీసుకెళ్లేందుకు గుమికూడారు.
రోడ్డు ప్రమాదంపై సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మిగిలిపోయిన బీరు కార్టన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఎవరికీ గాయాలైన వివరాలు వెల్లడి కాలేదు. కాగా ఈ మద్యాన్ని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం తెలియరాలేదు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.