రాజ్కోట్ : దీపావళి పండుగకు తగిన మొత్తం సమకూర్చుకోలేదనే బాధతో 22 ఏండ్ల మెకానిక్ నిప్పంటించుకుని తనువు చాలించిన ఘటన గుజరాత్లోని రాజ్కోట్లో వెలుగుచూసింది. మృతుడిని సిద్ధార్ధ్ ఖండేకగా గుర్తించారు. వనేకర్లోని భాటియా సొసైటీకి చెందిన సిద్ధార్ధ్ తగినంత ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా తండ్రి ఆర్ధిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే కావడం దీపావళి జరుపుకునేందుకు డబ్బులు సమకూరకపోవడంతో వేదనకు గురై తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
బాధితుడు తనకు తాను నిప్పంటించుకోగా కుటుంబసభ్యులు, స్ధానికులు కాపాడే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సిద్ధార్ధ్ను సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.